సీఎం యోగిపై బీఎస్పీ నేత ఖ్వాజా శంషుద్దీన్ పోటీ 

సీఎం యోగిపై  బీఎస్పీ నేత ఖ్వాజా శంషుద్దీన్ పోటీ 

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 54 మంది అభ్యర్థుల జాబితాను బహుజన్ సమాజ్ పార్టీ విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన లిస్టులో ఏడుగురు ముస్లిం అభ్యర్థులకు పార్టీ టికెట్ ఇచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలో దిగుతున్న గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ మైనార్టీ నేతను పోటీలో నిలిపింది. ఖ్వాజా శంషుద్దీన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. ఫజిల్ నగర్ నుంచి ఎస్పీ అభ్యర్థి స్వామి ప్రసాద్ మౌర్యపై సంతోష్ తివారీని పోటీలో నిలిపింది. బలియా జిల్లాలోని రస్రా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా శంకర్కు మరోసారి అవకాశమిచ్చింది. బీఎస్పీకి గుడ్ బై చెప్పి ఎస్పీలో చేరిన చిల్లుపర్ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీపై రాజేంద్ర సింగ్ను పోటీ చేయనున్నారు. 

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు