ఆగస్టు 28 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు

ఆగస్టు 28 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
  • అకడమిక్ క్యాలెండర్రిలీజ్ చేసిన జేఎన్టీయూ 

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 నుంచి బీటెక్ ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ 2023–24 అకడమిక్ క్యాలెండర్ ను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ నెల28 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్.. సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 4 వరకూ క్లాసులు ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 23 నుంచి 28 వరకూ దసరా సెలవులు.. నవంబర్ 6  నుంచి 11 వరకూ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయని వెల్లడించారు. సెకండ్ స్పెల్ క్లాసులు నవంబర్ 13 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకూ.. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ జనవరి 16 నుంచి 22 వరకూ ఉంటాయన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ.. ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఫిబ్రవరి 12 నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు.