జాకీలతో లేపిన జీ+2 బిల్డింగ్ ను కూల్చేసిన్రు

 జాకీలతో లేపిన జీ+2 బిల్డింగ్ ను కూల్చేసిన్రు

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీనివాస్ నగర్ లో రోడ్డు కంటే తన ఇల్లు డౌన్​లో ఉందని భావించిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏండ్ల కిందట నిర్మించిన జీ+2 బిల్డింగ్ జాకీల సాయంతో పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని బిల్డింగ్​పక్క ఇంటిపైకి వాలింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం సదరు జీ+2 బిల్డింగ్ లోని కొంత భాగాన్ని కూల్చివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సోమవారం పూర్తిగా కూల్చివేస్తామని చెప్పారు.