సిమ్లా: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం (మే 14) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ హర్ధిక్ పాండ్య ఈ మ్యాచుకు దూరమయ్యాడు. పాండ్యతో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, అల్లా ఘజన్ఫర్ కూడా ఈ గేమ్ ఆడటం లేదు.
పంజాబ్తో మ్యాచుకు ఈ ముగ్గురు దూరం కావడానికి గల కారణాలను టాస్ సమయంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ బుమ్రా వెల్లడించాడు. వెన్ను నొప్పి గాయం కారణంగా గత రెండు మ్యాచులకు దూరమైన హర్ధిక్ పాండ్య ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచుకు కూడా అందుబాటులో లేడని తెలిపాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్, అల్లా ఘజన్ఫర్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. మొత్తం రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్కు ఫస్ట్ టైమ్ కెప్టెన్గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నాడు బుమ్రా.
ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకుని అతిథ్య పంజాబ్ను ఫస్ట్ బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇరు జట్లలో మార్పులు చేర్పులు జరిగాయి. పంజాబ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి వచ్చారు.
►ALSO READ | IPL 2026: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న బుమ్రా.. ముంబైలో కీలక మార్పులు
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించిన ముంబైకి ఈ మ్యా్చ్ నామమాత్రమే కాగా, ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఈ గేమ్లో గెలవడం అయ్యర్ సేనకు ఎంతో అవసరం. దీంతో సొంతగడ్డపై ముంబైను చిత్తు చేయాలని పంజాబ్ ఉవ్విళ్లూరుతోంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(c), రఘు శర్మ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
