పూడ్చి పెట్టిన చిన్నారిని వెలికితీసి పోస్టుమార్టం..పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి లో ఘటన

పూడ్చి పెట్టిన చిన్నారిని వెలికితీసి పోస్టుమార్టం..పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి లో ఘటన

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో పది నెలల బాలిక మరణించగా, పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన షేర్ల హరీశ్, భవాని దంపతుల కూతురు(10 నెలలు) విష్ణుప్రియ ఈ నెల 18న ప్రమాదవశాత్తు మంచంపై నుంచి కింద పడి మరణించిందని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 

అయితే, తన కూతురును భర్త హరీశ్​ కొట్టడం వల్లే గాయపడి మృతిచెందిందని భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా గ్రామ శివారులో పూడ్చిపెట్టిన విష్ణుప్రియ డెడ్ బాడీని వెలికి తీసి ఫోరెన్సిక్​ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు. ఇన్​చార్జి తహసీల్దార్ సిరిపురం గిరి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ పాల్గొన్నారు.