ఓటర్లకు టికెట్లపై డిస్కౌంట్: అభీబస్​లో అభీఓట్​

ఓటర్లకు టికెట్లపై డిస్కౌంట్: అభీబస్​లో అభీఓట్​

హైదరాబాద్, వెలుగు: ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి అభీఓట్​పేరుతో ప్రత్యేక డిస్కౌంట్​సేల్ నిర్వహిస్తున్నట్టు బస్​అగ్రిగేటర్​ ప్లాట్​ఫారమ్​అభీబస్​ ప్రకటించింది. ఈ 13వ తేదీన ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేళ్లే వారికి 20 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. టికెట్​పై రూ.250 తగ్గింపుతో పాటు రూ. 100 క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇస్తామని తెలిపింది. ఇందుకోసం ‘ABHIVOTE’ అనే కోడ్​ను బుకింగ్​టైంలో టైప్​చేయాలి. ఈ ఆఫర్ ఏపీ,  తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించామని అభీబస్​ తెలిపింది.  అభీబస్ 2024 ఆర్థిక సంవత్సరం మొదటి సగం నాటికి బస్ టిక్కెట్లలో 12.5శాతం ​​మార్కెట్ వాటాను సాధించింది.