నదిలో పడ్డ బస్సు..8 మంది మృతి

నదిలో పడ్డ బస్సు..8 మంది మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అర్ధరాత్రి ఫ్లై ఓవర్  పై నుంచి అదుపు తప్పి  రైసెన్ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఓ మహిళ, రేండేళ్ల బాలుడు ఉన్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగింది. బస్సు రైసేన్ నుంచి ఛత్తార్‌ పూర్‌ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే  ఘటనాస్థలికి  వచ్చిన పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. నదిలో కొట్టుకుపోతున్న కొందరిని కాపాడారు. గాయపడ్డవారిని సమీప హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.