బైజూ ఇండియా సీఈవో రాజీనామా.. కొత్త సీఈవో గా అర్జున్ మోహన్

బైజూ ఇండియా  సీఈవో రాజీనామా.. కొత్త సీఈవో గా అర్జున్ మోహన్

ఎడ్ టెక్ సంస్థ BYJU సీఈవో మృణాల్ మోహిత్ తన పదవికి రాజీనామా చేశారు.  వ్యవస్థాపక భాగస్వామిగా, భారత దేశలో కంపెనీ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న మృణాల్ బుధవారం రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో BYJU  ఇంటర్నేషనల్ బిజినెస్ CEO అర్జున్ మోహన్ దేశ కార్యకలాపాల అదనపు బాధ్యతను తీసుకుంటారని పేర్కొంది. సంస్థ అభివృద్ధికి వ్యవస్థాపక బృందంలో మృణాల్ సహకారం చెరగని ముద్ర వేసిందని.. కలిసి కట్టుగా ఇది సాధించిన ఘనతకు గర్వపడుతున్నామని.. మృణాల్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నామని BYJU మరో వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO బైజు రవీంద్రన్ అన్నారు.