మంచి చేసే ప్రభుత్వాన్ని వదులుకోవద్దు : సి.లక్ష్మారెడ్డి

మంచి చేసే ప్రభుత్వాన్ని వదులుకోవద్దు : సి.లక్ష్మారెడ్డి

బాలానగర్, వెలుగు: మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోవద్దని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన బాలానగర్  మండలంలోని రూప్ సింగ్ తండా, గుండేడ్, పంచంగులగడ్డతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండా, ఊటకుంటతండా, వాయలకుంటతండా, బావాజీతండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్​ హయాంలోనే జడ్చర్ల అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు. కాగా, లక్ష్మారెడ్డి తరఫున ఆయన కుమారుడు స్వరణ్ రెడ్డి నవాబుపేట మండలంలోని కొల్లూరు, పోమాల్ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్​ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. కూతురు జడ్చర్ల మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.