
కోల్బెల్ట్, వెలుగు: జర్నలిస్టు ఎండీ.మునీర్ విగ్రహాన్ని కోల్బెల్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని రివల్యూషన్యువజన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు అనిల్ భగత్, అక్బర్ తదితరులుకోరారు. ఈ మేరకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను శుక్రవారం రామగుండంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కాకా కుటుంబంతో మునీర్కు వీడదీయని అనుబంధం ఉందని, ఆయన పేరిట ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇచ్చేందుకు చొరవచూపాలని విన్నవించారు. ఎంపీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.