​టాయిలెట్​ వస్తదని అసలు మంచినీళ్లే తాగుతలేం : మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్​

​టాయిలెట్​ వస్తదని అసలు మంచినీళ్లే తాగుతలేం : మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్​

మంచిర్యాల జిల్లా మైలారంలో విద్యార్థుల నిరసన 

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్​ బుధవారం స్కూల్ ​మేనేజ్​మెంట్​చైర్మన్​ భాస్కర్​ ఇంటిని ముట్టడించారు. వెంటనే టాయిలెట్స్​ కట్టించాలని ఇంటి ఎదుట బైఠాయించారు. బాలికలు మాట్లాడుతూ స్కూల్​లో 207 మంది స్టూడెంట్స్​ఉండగా, ఇందులో 100 మంది బాలికలం ఉన్నామన్నారు. గత ఎండాకాలం సెలవుల్లో కొత్త టాయిలెట్స్​కడతామని పాత టాయిలెట్స్​ను కూలగొట్టారన్నారు. ముగ్గు పోసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని వాపోయారు. టాయిలెట్స్​ లేక నీళ్లు తాగడం మానేశామన్నారు. 

టాయిలెట్స్​ కట్టించేంతవరకు నిరసన తెలుపుతామన్నారు. దీంతో చైర్మన్​భాస్కర్​ వారికి సర్ధి చెప్పి స్కూల్​కు వెళ్లారు. ఆయన వెంటే పిల్లలంతా పాఠశాలకు వెళ్లారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ చైర్మన్​కు వినతిపత్రం ఇచ్చి క్లాసులకు వెళ్లిపోయారు.