బోర్డు ఉద్యోగులకు ఇంటి స్థలాలు వద్దు

బోర్డు ఉద్యోగులకు ఇంటి స్థలాలు వద్దు
  •     తీర్మానాన్ని అడ్డుకున్న నామినేటెడ్ ​సభ్యుడు
  •     అతనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఉద్యోగులు 
  •     వాడీవేడిగా కంటోన్మెంట్​ బోర్డు మీటింగ్

కంటోన్మెంట్, వెలుగు : ఉద్యోగుల ఇంటి స్థలాలు, అక్రమ నిర్మాణాలకు పెనాల్టీ అంశాలపై కంటోన్మెంట్ బోర్డుపాలక మండలి సమావేశం వాడీవేడిగా సాగింది. శుక్రవారం సికింద్రాబాద్ ​కంటోన్మెంట్ డిఫెన్స్ ఎస్టేట్ కాన్ఫరెన్స్​ హాలులో జరిగిన మీటింగ్ లో బోర్డు సభ్యులు పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కొన్నింటికి బోర్డు నామినేటెడ్​ సభ్యుడు రామకృష్ణ అభ్యంతరం లేవనెత్తారు. హస్మత్​పేటలోని 28ఎకరాల స్థలాన్ని బోర్డు ఉద్యోగులకు కేటాయించాలని సీఈఓ మధుకర్​నాయక్​ ప్రతిపాదించగా, నామినేటెడ్​సభ్యుడు వ్యతిరేకించారు.

రూ. కోట్ల  విలువైన స్థలాన్ని ఎలా ఉద్యోగులకు కేటాయిస్తారని, రిటైర్డ్​ఉద్యోగులకు కూడా ఇళ్లస్థలాలు కేటాయిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. దీంతో వాయిదా వేశారు. కంటోన్మెంట్​బోర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేందర్​ అనంతరం రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. 500 మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని  రామకృష్ణపై అసహనం వ్యక్తం చేస్తూ నిలదీశారు.  

మరోవైపు అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసేందుకు బోర్డు ప్రతిపాదించగా నామినేటెడ్​ సభ్యుడు అడ్డుకోగా పెండింగ్ పెట్టారు.    బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, ఎమ్మెల్యే లాస్య నందిత, సీఈఓ మధుకర్​నాయక్​, జాయింట్ సీఈఓ ఆకాశ్​కుమార్​శర్మ పాల్గొన్నారు.  బోర్డు అభివృద్ధికి సీఎం  హామీపై  ధన్యవాదాలు తెలిపారు.