చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఇవాళ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభమ‌య్యే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టులో రెండు మార్పులు ఉన్నట్లు తెలిపాడు. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడని, లలిత్ యాదవ్ స్థానంలో అతను ఆడుతున్నాడని తెలిపాడు. అలాగే మన్‌దీప్ సింగ్ స్థానంలో కేఎస్ భరత్ ఆడుతున్నాడని చెప్పాడు. చెన్నై జట్టులో కూడా ఒక మార్పు చోటుచేసుకుంది. ఫిట్‌నెస్ సమస్య కారణంగా జడేజా ఈ మ్యాచ్ ఆడటం లేదని ధోనీ తెలిపాడు. అతని స్థానంలో దూబే ఆడతాడని చెప్పాడు.

తుది జ‌ట్లు: 
చెన్నై సూప‌ర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఉత‌ప్ప‌, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, శివ‌మ్ దూబే, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, సిమ్ర‌న్‌జీత్ సింగ్‌, మ‌హీశ్ తీక్ష‌ణ‌, ముకేశ్ చౌద‌రీ

ఢిల్లీ క్యాపిట‌ల్స్: డేవిడ్ వార్న‌ర్‌, శ్రీక‌ర్ భ‌ర‌త్‌, మిచెల్ మార్ష్‌, రిష‌బ్ పంత్‌, రిప‌ల్ ప‌టేల్‌, రోవ‌మ‌న్ పావెల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, శార్ధూల్ ఠాకూర్‌, కుల్దీప్ యాద‌వ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, అన్రిచ్ నోర్జే