కరెంట్ స్తంభాన్ని ఢికొన్న కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కరెంట్ స్తంభాన్ని ఢికొన్న కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి 263 పిల్లర్ వద్ద కరెంట్ స్తంభాన్ని కారు ఢికొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కరెంట్ పోల్ కు ఢికొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిద్ర మత్తులో జారు కోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. 

ALSO READ : బీ అలర్ట్ : హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్