
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్లో తనకున్న మొత్తం 10.44 శాతం వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేసింది. ఈ అమ్మకం ద్వారా కార్లైల్ గ్రూప్నకు దాదాపు రూ. 2,712 కోట్లు లభించాయి.
తన అనుబంధ సంస్థ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ద్వారా మొత్తం 2.71 షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అమ్మింది. ఒక్కో షేరును రూ.వెయ్యి చొప్పున అమ్మింది. కోటక్మహీంద్రా ఎంఎఫ్, కెనరా రొబెకో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిటీ గ్రూప్ వంటి కంపెనీలు షేర్లను దక్కించుకున్నాయి.