
కడప నుంచి హైదరాబాద్ వచ్చి ఓ లాడ్జిలో దిగిన కార్పెంటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచిగూడ తారకరామా థియేటర్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది.
గురవారం కడప నుండి వచ్చి కాచిగూడలోని హోటల్ హైదరాబాద్ కంఫర్ట్ రెసిడెన్సీలో నలుగురు వ్యక్తులు దిగారు. వారిలో ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. కర్కశంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ రోజు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనపై హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని రెడ్డి సాయి కుమార్ (24)గా గుర్తించారు. అతడు కార్పెంటర్గా పని చేస్తుంటాడని తెలిసింది.
అసలు ఈ హత్య ఎలా జరింది? కారణాలు ఏమిటీ? వాళ్లు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మృతుడితో పాటు ఉన్నవాళ్లెవరు? హంతకులెవరు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జి రిజిస్టర్, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఎంక్వైరీ సాగిస్తామని చెబుతున్నారు.
MORE NEWS:
కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా
కార్డు లిమిట్ పెంచుతమని.. అన్ లిమిటెడ్ దోపిడీ
పోలీస్ స్టేషన్ ముందే ASI ఆత్మహత్య యత్నం