మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పై కేసు

మహబూబాబాద్  బీజేపీ ఎంపీ అభ్యర్థి  సీతారాం నాయక్ పై కేసు
  •   మూలవరుల ఫొటోలు తీసిన బీజేపీ అభ్యర్థి అనుచరుడు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం రామాలయంలో శనివారం అపచారం జరిగింది. బీజేపీ మహబూబ్​బాద్​ లోక్​సభ క్యాండిడేట్​ సీతారాంనాయక్​అనుచరుడు శ్రీసీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామి మూలవరుల ఫొటో తీసి సోషల్​ మీడియాలో వైరల్​ చేశాడు. ఆలయంలోకి సెల్​ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం ఉంది. ఆలయం కింద కౌంటర్‌‌‌‌‌‌‌‌లో వాటిని  డిపాజిట్‌ చేశాకే ఆలయంలోకి రావాలి. చిత్రకూట మండపం, గాలిగోపురం, ఉత్తరద్వారం వద్ద మూడంచెల్లో సెక్యూరిటీ సిబ్బంది భక్తుల బ్యాగులు, జేబులు చెకింగ్​ చేస్తారు.

అయినప్పటికీ అతను ఫోన్‌‌‌‌ తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ​ఉండదు. తప్పనిసరిగా వారిని తనిఖీ చేయాల్సిందే. కానీ, సెక్యూరిటీ స్టాఫ్​ వారిని ఎందుకు చెక్​ చేయలేదు..? ఎలా అనుమతించారు..? అని భక్తులు మండిపడుతున్నారు.

సోషల్​ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఈవో ఎల్​.రమాదేవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె సీసీ ఫుటేజీని పరిశీలించి సీతారాంనాయక్​ వెంట వచ్చిన ఆయన అనుచరుడు ఈ ఫొటోలు తీసినట్లుగా గుర్తించారు.  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీతారాం నాయక్ పై కేసు నమోదు చేశారు భద్రాచల పట్టణ పోలీసులు