ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అక్కడి పోలీసులు కేసు పెట్టారు. ఇస్లామాబాద్లో నిర్వహించిన ర్యాలీలో జడ్జిలను, పోలీసులను బెదిరించినందుకు యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద ఇమ్రాన్ ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈమేరకు మెజిస్ట్రేట్ జావేద్ అలీ ఫిర్యాదుతో మార్గాల్ల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
ఇదే అంశంపై ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఇకపై లైవ్ టెలికాస్ట్పై చేయకుండా ప్రభుత్వం బ్యాన్ విధించింది. ప్రభుత్వ సంస్థలు, ఉన్నతాధికారులపై ఆయన ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని, అవి దేశంలో అశాంతికి కారణం కావొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటర్ అథారిటీ (పీఈఎమ్ఆర్ఏ) పేర్కొంది.