పాక్​​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై కేసు

పాక్​​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై కేసు

ఇస్లామాబాద్: పాక్​​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​పై అక్కడి పోలీసులు కేసు పెట్టారు. ఇస్లామాబాద్​లో నిర్వహించిన ర్యాలీలో జడ్జిలను, పోలీసులను బెదిరించినందుకు యాంటీ టెర్రరిజం యాక్ట్​ కింద ఇమ్రాన్​ ఖాన్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈమేరకు మెజిస్ట్రేట్​ జావేద్​ అలీ ఫిర్యాదుతో మార్గాల్ల పోలీస్​ స్టేషన్​లో ఈ కేసు నమోదైంది.

ఇదే అంశంపై ఇమ్రాన్​ ఖాన్​ ప్రసంగాలను ఇకపై లైవ్​ టెలికాస్ట్​​పై చేయకుండా ప్రభుత్వం బ్యాన్​ విధించింది. ప్రభుత్వ సంస్థలు, ఉన్నతాధికారులపై ఆయన ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని, అవి దేశంలో అశాంతికి కారణం కావొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పాకిస్తాన్​ ఎలక్ట్రానిక్​ మీడియా రెగ్యులేటర్ అథారిటీ (పీఈఎమ్​ఆర్​ఏ) పేర్కొంది.