- ఆయన భార్య నీలిమా, మరొకరిపై కూడా..
- డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమా, మరొకరిపై భూకబ్జా కేసు నమోదైంది. డూప్లికేట్డాక్యుమెంట్లతో లేఅవుట్ను అగ్రికల్చర్ల్యాండ్గా కన్వర్ట్చేసి తన ప్లాట్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారనే బాధితుల ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లోని రామంతపూర్కు చెందిన ఎంఏ రషీద్, ఖాదర్లకు చెందిన పట్టా భూమిలో 1984, 1985 ప్రాంతంలో167 ప్లాట్లతో గ్రామ పంచాయతీ స్థాయిలో ఓ వెంచర్ వేశారు.
2020లో చాలా మంది ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేశారు. గుండాల మండలానికి చెందిన ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి కూడా ఈ వెంచర్లో ప్లాట్కొన్నాడు. ఈయన దగ్గర మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ బుద్ధానగర్ కు చెందిన ముచ్చర రాధిక150 గజాల ప్లాట్ కొనుగోలు చేశారు. తాను కొనుగోలు చేసిన ప్లాట్కు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు. గాయత్రీ ఎడ్యుకేషన్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య పల్లా నీలిమా, మధుకర్ రెడ్డి అక్రమంగా తన ప్లాట్ లోకి ప్రవేశించి, హద్దులు చేరిపేయడంతోపాటు ఆ ప్లాట్లో గుంతలు తీశారని, ప్లాట్హద్దులు ఎందుకు చెరిపివేస్తున్నారని ప్రశ్నించగా ఆ ప్లాట్ తమకు చెందుతుందని బూతులు తిడుతూ, బెదిరిస్తున్నారని ప్లాట్ఓనర్రాధిక ఇటీవల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
డూప్లికేట్డాక్యుమెంట్లు తయారు చేసి, లేఅవుట్ను అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చి తమ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పల్లా రాజేశ్వర్ రెడ్డిని, ఏ2గా ఆయన భార్య నీలిమాను, ఏ3గా మధుకర్రెడ్డి పేర్లను చేర్చారు.