గండిపేట ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లో ట్యాంకర్‌‌‌‌ డ్రైవర్, ఓనర్పై క్రిమినల్ కేసులు

గండిపేట ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లో ట్యాంకర్‌‌‌‌ డ్రైవర్, ఓనర్పై క్రిమినల్ కేసులు
  • ఎవరూ ఆపకుండా వాహనంపై వాటర్​ బోర్డు, బల్దియా లోగో
  • రిజర్వాయర్ల నీళ్లు సురక్షితమన్న  బోర్డు ఎండీ అశోక్​రెడ్డి  
  • ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా

హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి తాగునీరందించే ఉస్మాన్ సాగర్(గండిపేట) రిజర్వాయర్​లో మురుగునీటిని డంప్​చేసిన ట్యాంకర్​ను సీజ్​చేసి డ్రైవర్​పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. బుధవారం 8 గంటలకు హిమాయత్ నగర్ వద్ద ఉన్న ఎఫ్టీఎల్​పాయింట్ నంబర్ 428 వద్ద  టీజీ11 టీ1833 నంబర్​గల సెప్టిక్ ట్యాంకర్ మురుగునీటిని జలాశయంలోకి వదలడానికి ప్రయత్నించగా పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. 

ఈ విచారణలో డ్రైవర్ రమావత్ శివనాయక్ (33), హిమాయత్ నగర్ వాసి నిరంజన్ చెప్పినందుకే చేశానని అంగీకరించారు. విచారణలో ట్యాంకర్‌‌‌‌పై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్​బీ లోగో వినియోగించారని, ప్రజలను, అధికారులను నమ్మించి తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చేసినట్టు వాటర్​బోర్డు అధికారులు తేల్చారు.  

ఆరు నెలల్లో ఎస్టీపీలు పూర్తి..

జంట రిజర్వాయర్లలోకి చుట్టుపక్కల నుంచి సీవరేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుందని, రిజర్వాయర్​కు రెండు వైపులా ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, ఆరు నెలల్లో ఇవి పూర్తవుతాయని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. ఎస్టీపీలు కంప్లీట్​అయితే ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే సీవరేజ్ ని వందశాతం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఉస్మాన్ సాగర్ లోఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ప్రజ‌‌‌‌లు ఆందోళ‌‌‌‌న చెందాల్సిన అవ‌‌‌‌స‌‌‌‌రం లేద‌‌‌‌న్నారు. 

వాటర్​బోర్డు గండిపేట నీటిని ఆసిఫ్ నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి ప్రతి గంట‌‌‌‌కూ క్వాలిటీ చెక్​చేస్తున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ల పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే, స్థానిక అధికారులకు లేదా వాటర్​బోర్డు 155313 కస్టమర్ కేర్ నంబర్‌‌‌‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.