ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ పై కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎపిడమిక్ యాక్ట్ కింద కేసు రిజిస్ట్రర్ చేశారు. ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ కు సెప్టెంబర్ 29వ తేదీన కరోనా వచ్చింది. కరోనా సోకిన తర్వాత కూడా ఆయన అక్టోబర్ 4 న యూపీలోని హత్రాస్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్రాస్ కు వెళ్లిన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు హత్రాస్ పోలీసులు.
ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్