బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఇంఛార్జ్ కొయ్యల ఏమాజి పార్టీ కార్యకర్తలతో కలిసి బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై మేకల సంతోష్ చెప్పారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేవరకు బీజేపీ అధ్వర్యంలో పోరాటం చేస్తామని కొయ్యల అన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.