Bengaluru Stampede: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంపై కేసులు..! తప్పు పోలీసులదా లేక RCBదా..?

Bengaluru Stampede: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంపై కేసులు..! తప్పు పోలీసులదా లేక RCBదా..?

RCB Victory Parade: బెంగళూరులో నిన్న చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట దేశం మెుత్తాన్ని కలిచివేసింది. చాలా మంది దీనిలో ఫ్యాన్స్ చేసింది తప్పంటుంటే మరికొందరు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం కర్ణాటక క్రికెట్ బోర్డును, పోలీసు వ్యవస్థను తప్పుపడుతున్నారు. కానీ ఇక్కడ అసలు వాస్తవాలను మనం గమనించాల్సి ఉంటుంది.

ఈ దుర్గటనతో బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య్, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వీరితో పాటు కర్ణాటక క్రికెట్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెడుతున్నారు. 11 మంది మరణానికి కారణమైన తప్పులను అసలు ముందు అందరూ గ్రహించాలి. 

ఒకపక్క 18 ఏళ్ల తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గెలిచిందనే ఉత్సాహంలో ఉన్న ఫ్యాన్స్.. మరో పక్క విక్టరీ పరేడ్ వంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం లేని బెంగళూరు నగరం. ఈ రెండింటి మధ్యలో సమన్వయ లోపం ఫ్యాన్స్ ప్రాణాలను బలిగొందనేది వాస్తవం. కప్పు గెలిచిన ఆర్సీబీ ఉదయం తమ సోషల్ మీడియా ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రకటించింది. దీంతో సాయంత్రం 3.30 సమయానికి చిన్న స్వామి స్టేడియం బయట భారీగా ఫ్యాన్స్ గుమ్మిగూడారు. అప్పటికే డ్యూటీలో అలసిపోయిన పోలీసులకు అదనంగా స్టాఫ్ అందించకపోవటం గురించి పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో సీనియర్ పోలీసు అధికారులు స్టేడియం వద్ద కాకుండా ఆటగాళ్లను సత్కరిస్తున్న విధాన సౌద వద్ద సెక్యూరిటీకి వెళ్లటంతో పరిస్థితులు చేజారాయి. స్టేడియం వద్ద ఉన్న పోలీసులకు పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సీనియర్స్ గైడెన్స్ లేకపోవటం, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం చిన్నపాటి చర్యలు, వైద్య సేవలు కనీసం పార్కింగ్ ఫెసిలిటీలు లేకపోవటం ఇబ్బందిని పెంచాయి. అలాగే స్టేడియంలో ఎంట్రీపై సమాచారం లేకపోవటంతో ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగింది. 

తొక్కిసలాటలో గాయపడిన వారిని పక్కన ఉన్నవారే సమీప ఆసుపత్రికి పంపేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించారు కానీ అధికారులు మాత్రం రంగంలోకి రాలేదు. ఇక్కడ పూర్తిగా అనుభవలేమి, అలాగే నిర్లక్ష్యం, సమన్వయ లోపాలు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం దీనిని వారాంతంలో తుముకూరు లాంటి పెద్ద ప్రదేశంలో ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. కానీ మెుత్తానికి ఇలాంటి పెద్ద ఈవెంట్ కోసం అవసరమైన ముందస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు లేకపోవటమే ఫ్యాన్స్ ప్రాణాలను మింగేసిందని ప్రాథమికంగా వెల్లడైంది.