
- చనిపోయిన వారి సంఖ్య 239
- 24 గంటల్లో 40 మంది మృతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. శనివారం ఉదయం నాటికి కేసుల సంఖ్య 7447కు చేరింది. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 239 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో 40 మంది చనిపోయారన్నారు. శుక్రవారం ఒక్కరోజే 1035 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కేసులో సంఖ్య 1574కు చేరిందని అధికారులు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 110 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య 900 దాటగా.. 13 మంది చనిపోయారు.