
కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ రమేశ్ జర్కిహోలి తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రమేశ్ ఓ మహిళతో చనువుగా ఉంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ కు సామాజిక కార్యకర్త దినేష్ కల్లాహల్లి మంగళవారం అందజేశారు. తనకు మంత్రి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. బెంగళూరు ఆర్టీనగర్ కు చెందిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ లొంగదీసుకుని రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది. మరో వైపు రాష్ట్రంలోని డ్యామ్ లను డ్రోన్ కెమెరా ద్వారా తీసి ఓ డాక్యుమెంటరీ చేసేందుకు పర్మీషన్ కోసం ఆ యువతి మంత్రిని కలిసిందని..అప్పటి నుంచే పరిచయం ఏర్పడి శారీరక సంబంధం వరకు వెళ్లిందనేది ఓ వాదనగా ఉంది. అయితే ఆ వీడియోను ఎవరు తీశారనేది ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి వీడియోతో కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో మంత్రి రమేశ్ జర్కిహోలి తన మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.