ఆవుపై మ‌నిషి అత్యాచారం.. ఎస్.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే..

ఆవుపై మ‌నిషి అత్యాచారం.. ఎస్.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే..

ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌లో ఓ వ్యక్తి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడున్నకెమెరాల్లో రికార్డయ్యాయి. అత్యంత షాకింగ్ కు గురి చేసే ఈ సంఘటనలో మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఇలా ఒక్క ఆవుపైనే కాదు.. మరో మూడు జంతువులతోనూ అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు.

ఈ కేసులో 57 ఏళ్ల బ్రిజేష్ కుమార్ మిశ్రాను IPC సెక్షన్ 377 (జంతువులతో అసహజ సెక్స్) కింద అరెస్టు చేశారని కాన్పూర్ జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. మిశ్రా ఆ ప్రాంతంలోని 3 వేర్వేరు జంతువులతో కూడా లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు చూపించే చాలా సీసీటీవీ ఫుటేజీలు తాము గుర్తించామని తెలిపారు. విచారణలో అతడు మానసిక వ్యాధిగ్రస్తుడని తేలిందన్న కమిషనర్.. అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

ట్విట్టర్‌లో దుమారం రేపుతోన్న ఈ ఫుటేజీలో ఖాళీగా కూర్చున్న ఓ ఆవుపై మిశ్రా అత్యాచారం చేస్తున్నట్లు కనిపించింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు జూలై 6న అర్థరాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు.. జూలై 7న మిశ్రాను అరెస్టు చేశారు.