రావూస్​ స్టడీ సర్కిల్ సీఈఓపై సీబీఐ కేసు

రావూస్​ స్టడీ సర్కిల్ సీఈఓపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: వరదలతో ఇటీవల ఢిల్లీలో ఐఏఎస్​కు ప్రిపేర్​అవుతున్న ముగ్గురు చనిపోయిన ఘటనలో రావూస్​ స్టడీ సర్కిల్​ సీఈఓ అభిషేక్ గుప్తాపై  సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. నేరపూరిత హత్య, నిర్లక్ష్యం, భవన నిర్మాణంలో లోపాలకు సంబంధించి పలు సెక్షన్లను చేర్చారు.

జులై 27న ఓల్డ్ రాజేంద్ర నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐఏఎస్ శిక్షణ అకాడమీ గ్రౌండ్​ ఫ్లోర్​లోకి నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు ఈ ఘటనపై స్టూడెంట్స్​ ఆందోళనకు దిగడంతో.. ఒక్కో అభ్యర్థి కుటుంబానికి రావూస్​ కోచింగ్​ సంస్థ రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.