బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు
అభిషేక్రావు బెయిల్ పిటిషన్పై స్పెషల్ కోర్టులో సీబీఐ
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్రావుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేయొచ్చని సీబీఐ అధికారులు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న అభిషేక్రావు తనకు బెయిల్ ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ సందర్భంగా.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితుడు సాక్షులను బెదిరించవచ్చని, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరఫు లాయర్.. సీబీఐ తన దర్యాప్తును ముగించిందని బెంచ్కు వివరించారు. విచారణ ఈ నెల 9 కి వాయిదా వేసింది.