బిజినెస్ రంగంలోకి సెలబ్రిటీ కపుల్స్.. బ్రాండ్ ఏంటంటే ?

బిజినెస్ రంగంలోకి సెలబ్రిటీ కపుల్స్.. బ్రాండ్ ఏంటంటే ?

జవాన్​ సక్సెస్​ ఇచ్చిన జోష్​లో నయనతార(Nayanthara) దంపతులు గుడ్ న్యూస్​ చెప్పారు. ఈ క్రేజీ కపుల్​ బిజినెస్​ రంగంలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించారు. 9స్కీన్(9Skin) ​అఫీషియల్​ పేరుతో స్కీన్​కేర్​ ప్రాడక్ట్స్​కి సంబంధించిన బ్రాండ్​ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు వీరిద్దరూ చేసిన పోస్ట్​ వైరలవుతోంది.

ఆరేళ్ల మా కృషి, ప్రేమను ఈ రోజు మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాం. మా అధికారిక బ్రాండ్​ను ప్రకటించడం గర్వంగా, సంతోషంగా ఉంది. సెల్ఫ్‌ లవ్‌ ఎంతో ముఖ్యమని మేము నమ్మాం. ఇక ఈ నెల 29 నుంచి మా ప్రయాణం మొదలు కానుంది. ఆ రోజు నుంచి స్కిన్‌ కేర్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను మీరు మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయవచ్చు అని ఈ దంపతులు వెల్లడించారు. 

ప్రస్తుతం ఏదైనా బ్రాండ్‌ ప్రచారం కోసం ప్రయివేట్ సంస్థలు, హీరోలు, హీరోయిన్లను కాంటాక్ట్ అవ్వడం తెలిసిందే. కానీ, ఏకంగా తమకంటూ సొంతంగా ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోవాలని చాలా మంది స్టార్స్ ఆలోచిస్తున్నారు. ఇక ఇది వరకే, చాలా మంది హీరోయిన్స్ తమ సొంత బ్రాండ్స్ ని వినియోగిస్తున్నారు. అంతే కాకుండా పలు కంపెనీస్ కు బ్రాండ్ అంబాసిడర్లు గా ఉంటున్నారు.

Also Read :- బేబీ సినిమాకు పోలీసుల నోటీసులు

అందులో రష్మిక మందన్నా ఒకరు. రష్మిక చర్మ సంరక్షణకు వేగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌గాడ్సెస్‌ ఉత్పత్తులనే ఆమె ఎక్కువగా వినియోగిస్తుంది. కాగా ఈ కంపెనీలో రష్మిక పెట్టుబడి కూడా పెట్టినట్టు టాక్. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా అనోమలీ అనే స్కిన్‌ అండ్‌ హెయిర్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేసింది. అలాగే శృతి హాసన్ Pulp X Shruti పేరుతో ఓ బ్రాండ్‌ను క్రియేట్‌ చేసింది. ఈ బ్రాండ్ నుంచి మరిన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా పలువురు స్టార్స్ తమ సొంత బిజినెస్ రంగంలో దిగి అదృష్టం పరీక్షించుకోనున్నారు.