వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్ : లక్ష్మీస్ NTR రిలీజ్ ఆపాలంటూ నోటీసులు

వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్ : లక్ష్మీస్ NTR రిలీజ్ ఆపాలంటూ నోటీసులు

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ రిలీజ్ పై అనుమానాలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కించాడు. 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో ఈ సినిమా విడుదల చేయడం సరైంది కాదని TDP కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌ బోర్డు సినిమా యూనిట్ ను ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది.

దీనిపై  ట్విటర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ.. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించాడు. దీంతో సినిమా విడుదల అవుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో కడపలో ఓ బహిరంగ సభలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ శనివారం తెలిపాడు.