న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 శాతం బ్రాంచీలను మూసివేయనుంది. ఆర్థికంగా బలపడేందుకు 600 బ్రాంచీలను మూసేయాలని బ్యాంకు నిర్ణయించింది. నష్టాలతో నడిచే కొన్ని బ్రాంచీలను ఇతర బ్రాంచీలలో విలీనం చేయనుంది. ఈ బ్రాంచీల మూసివేతను మార్చి 2023 నాటికల్లా పూర్తి చేయాలని సెంట్రల్బ్యాంకు టార్గెట్గా పెట్టుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ఆర్థికంగా పటిష్టంగా మారే దిశలో నాన్–కోర్ అసెట్లను కూడా ఈ బ్యాంకు తర్వాత దశలో అమ్మనున్నట్లు సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. 100 ఏళ్లుగా నడుస్తున్న ఈ బ్యాంకుకు మొత్తం 4,594 బ్రాంచీలున్నాయి. 2017లో మరికొన్ని ఇతర ప్రభుత్వ బ్యాంకులతో కలిపి, సెంట్రల్ బ్యాంకును ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కిందకు ఆర్బీఐ తీసుకు వచ్చింది. ఇతర బ్యాంకులన్నీ ఆర్థికంగా మెరుగుదలతో పీసీఏ నుంచి బయటపడినా, సెంట్రల్ బ్యాంకు మాత్రం బయటపడలేకపోతోంది. ఉద్యోగులను సక్రమంగా వినియోగించుకోలేక, లాభాల బాటలోకి రాలేకపోతున్నట్లు సెంట్రల్ బ్యాంకు తన బ్రాంచీలకు పంపిన ఒక లెటర్లో పేర్కొంది. ఈ నెల 4 వ తేదీన ఈ లెటర్ను పంపించారు. డిసెంబర్ 2021 క్వార్టర్లో సెంట్రల్ బ్యాంకు రూ. 282 కోట్ల లాభం ఆర్జించింది. కానీ, ఈ బ్యాంకు ఎన్పీఏలు 15.16 శాతంగా ఉన్నాయి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎన్పీఏల శాతం చాలా ఎక్కువగా నమోదవుతోంది.
600 బ్రాంచీల మూత?
- బిజినెస్
- May 6, 2022
లేటెస్ట్
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి