పాత డీల్స్‌పై పన్ను రద్దు!

పాత డీల్స్‌పై పన్ను రద్దు!
  • ఇన్‌కం టాక్స్ చట్టానికి సవరణ తెస్తున్న ప్రభుత్వం
  • కెయిర్న్, ఓడాఫోన్‌లకు పెద్ద ఊరట

న్యూఢిల్లీ: పాత డీల్స్​పై పన్ను విధింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇన్​కం టాక్స్ యాక్ట్​కు సవరణతో గతంలో విధించిన ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను తొలగించింది. ఇన్​కం టాక్స్​ యాక్ట్​ సవరణ బిల్లును ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ గురువారం లోక్​సభలో ప్రవేశ పెట్టారు. ఇండియాలోని ఎసెట్స్​ను విదేశాలకు బదిలీ చేసేప్పుడు ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను విధించేవారు. మే 28, 2012 కి ముందు జరిగిన అలాంటి లావాదేవీల​పై ఇక మీదట పన్ను విధించరాదని తాజా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పటికే పన్ను చెల్లించాలంటూ జారీ చేసిన నోటీసుల​ను కూడా వెనక్కి తీసుకోవాలని ఇందులో పొందుపరిచారు. అంటే కెయిర్న్​, వోడాఫోన్​లకు ఈ సవరణ చాలా పెద్ద ఊరట కలిగిస్తుంది. ఇందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కోర్టులలోని పెండింగ్​ కేసులను వెనక్కి తీసుకోవడం, పరిహారం కోరకపోవడం, వడ్డీ అడక్కపోవడం వంటి అంశాలపై ఆయా కంపెనీలు అండర్​టేకింగ్​ ఇవ్వాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా తెచ్చిన రిఫార్మ్స్​ వల్ల దేశంలోని ఫైనాన్షియల్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్టార్​కు మేలు జరిగింది. ఆ రిఫార్మ్స్​ వల్లే దేశంలో పెట్టుబడులు పెరిగాయి. కానీ, ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ విధింపు వల్ల విదేశీ పెట్టుబడిదారులలో కొంత అసంతృప్తి పెరిగింది. కొన్ని వివాదాలు అంతర్జాతీయ కోర్టులకు, ఆర్బిట్రేషన్​కు చేరడంతో దేశ ప్రతిష్టపై కొంత దెబ్బతింది. ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు కొంత మంది పెట్టుబడులు పెట్టే విషయంలో వెనకడుగు వేశారు కూడా. కొవిడ్​–19 మహమ్మారి కారణంగా మన దేశ ఎకానమీని వెంటనే రికవరీ చేసుకోవల్సిన అవసరం కలిగింది. వేగంగా రికవరీ సాధించడానికి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు మన దేశానికి కావాలి. ఈ కారణాల వల్లే రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కెయిర్న్​, వోడాఫోన్​ గ్రూప్​లక ఊరట..
రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ విధింపుతో ఇబ్బందులలో పడిన కెయిర్న్​ ఎనర్జీ పీఎల్​సీ, వోడాఫోన్​ గ్రూప్​లకు ముఖ్యంగా తాజా సవరణ ఉపశమనం కలిగిస్తుంది. వడ్డీ లేకుండా ఆయా కంపెనీలు చెల్లించిన టాక్స్​ మొత్తాన్ని రిఫండ్​ చేయనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు కంపెనీలూ కూడా రెట్రాస్పెక్టివ్ టాక్స్​ విధింపు చెల్లదని ఇంటర్నేషనల్​ ఆర్బిట్రేషన్స్​ ట్రిబ్యునల్స్​లో ఆదేశాలు తెచ్చుకున్నాయి. వేల కోట్ల రూపాయలను రెట్రాస్పెక్టివ్​ పన్నుగా ఈ కంపెనీలపై మన ప్రభుత్వం విధించింది. దీంతో ఆ విదేశీ కంపెనీలు రెండూ, దేశంలో కూడా చాలా కాలం న్యాయపోరాటం చేశాయి. రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ కింద ఏకంగా 1.2 బిలియన్​ డాలర్ల (రూ. 9 వేల కోట్ల) ను కెయిర్న్​ ఎనర్జీ మన ప్రభుత్వానికి చెల్లించింది. దీనిని వెనక్కి రాబట్టుకునేందుకు విదేశాలలోని మన దేశపు ఎసెట్స్​ను స్వాధీనం చేసుకోవడానికి ఆర్బిట్రేషన్స్​ ట్రిబ్యునల్​ నుంచి ఆర్డర్లను తెచ్చుకొంది.  ఇక వోడాఫోన్​పై ​ కూడా రూ. 21 వేల కోట్లకు పైగా మొత్తాన్ని రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ కింద విధించారు. దీంతో ఈ గ్రూప్​ సైతం దేశ, విదేశాలలో న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. మొత్తం 17 కంపెనీలపై ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను విధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.1961 ఇన్​కం టాక్స్​ యాక్ట్​ ప్రకారం మన దేశంలోని కంపెనీలో వాటా కొన్నందుకు తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే వోడాఫోన్​ వాదనతో 2012లోనే సుప్రీం కోర్టు ఏకీభవించింది. కానీ, అప్పటి ఫైనాన్స్​ మినిస్టర్​ చట్టానికి సవరణ ప్రతిపాదించడంతో, ఇన్​కం టాక్స్​ అధికారులకు రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ విధించే అధికారం దక్కింది.

వివాదాలకు తెరతీసిన రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కెయిర్న్​, వోడాఫోన్​ వంటి కంపెనీలపై ఈ పన్ను విధించడంతో, ఆ కంపెనీలు దీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాయి. దాంతో కొంత మంది విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు 
పెట్టడానికి సైతం వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంతోపాటు, ఎకానమీ వేగంగా రికవరీ కావడానికి విదేశీ పెట్టుడులు మరిన్ని అవసరం ఉండటంతో ప్రభుత్వం ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్ విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.

రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ అంటే..
కొన్ని కంపెనీలపై వెనకటి లావాదేవీలకు సంబంధించి క్యాపిటల్​ గెయిన్స్​ టాక్స్​ విధించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కెయిర్న్​, వోడాఫోన్​లపై రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ విధించారు. ఈ రెట్రాస్పెక్టివ్​ టాక్స్​ను 2012 లో అమలులోకి తెచ్చారు. ఈ చట్టం కింద ఇండియాలో ఆస్తులున్న ఏదైనా విదేశీ కంపెనీ తన వాటాలను బదిలీ చేసుకుంటే వచ్చే మొత్తం మీద క్యాపిటల్​ గెయిన్స్ పన్నును కట్టాలనేది ఈ రూల్​.