నీళ్ల బాటిల్ పై ISI మార్క్ లేకపోతే శిక్ష : కేంద్రం

నీళ్ల బాటిల్ పై ISI మార్క్ లేకపోతే శిక్ష : కేంద్రం

భారత ప్రమాణాల సంస్థ- ISI (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ -) లోగో లేని బాటిళ్లలో నీళ్లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ .. లోక్ సభ క్వశ్చన్ అవర్ లో ఈ ప్రకటన చేశారు. ఐఎస్ఐ మార్క్ లేని బాటిళ్లలో నీళ్లు అమ్ముతున్నారనేదానిపై కేంద్రానికి చాలా కంప్లయింట్లు వచ్చాయని చెప్పారు. ఐతే.. ఇలా అమ్మడం పెద్ద నేరం అని ఆయన అన్నారు. ఈ నేరానికి చట్టపరమైన శిక్ష తప్పనిసరిగా ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సంస్థలపై దాడులు చేసి.. యాక్షన్ తీసుకోవాలన్నారు.

బాటిల్ పై ఉన్న రేట్ కే వాటర్ ను కచ్చితంగా అమ్మాలని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. అలాకాకుండా ఎక్కువ రేట్ కు అమ్మినా కూడా నేరం అవుతుందన్నారు. వినియోగదారులు దీనిపై కోర్టులకు వెళ్లడం జరుగుతూనే ఉందన్నారు. దీనికి ఓ పరిష్కారం కోసం చూపిస్తామన్నారు.