
కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ హై అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కరోనా సోకిన బాధితుల కుటుంబాలు, బంధువుల ఆరోగ్యంపై ఆరా తీస్తుంది. ఈ నేపథ్యంలో నోయిడాకు చెందిన స్కూల్లో కరోనా పేషెంట్ పిల్లలు చదువుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ స్కూల్ కు సెలవు ప్రకటించింది. స్కూల్ పిల్లలందరికి కరోనా టెస్ట్ లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఢిల్లీ పేషెంట్ ఎవరెవరితో మాట్లాడారు అనే అంశంపై ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.