సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సెంట్రల్‌‌ టీమ్‌‌

సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సెంట్రల్‌‌ టీమ్‌‌
  • ఎన్ఆర్ఈజీఎస్‌‌ పనుల పరిశీలన
  • సంగారెడ్డి జిల్లా రాయికోడ్, హస్నాబాద్‌‌ గ్రామాల్లో పర్యటించిన సెంట్రల్‌‌ టీమ్‌‌

రాయికోడ్ , వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంతో పాటు హస్నాబాద్‌‌ గ్రామంలో ఆదివారం కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎన్‌‌ఆర్‌‌ఈజీఎస్‌‌ డైరెక్టర్‌‌ సంజయ్‌‌కుమార్‌‌, టెక్నికల్‌‌ డిప్యూటీ డైరెక్టర్‌‌ పంకజ్‌‌ ఆధ్వర్యంలో పర్యటించిన టీమ్‌‌ సీసీ రోడ్లు, న్యూఫార్మేషన్, మెటలింగ్‌‌రోడ్లు, రైతు వేదిక, నీటి మళ్లింపు కాల్వలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ముందుగా రాయికోడ్‌‌లో పర్యటించి జడ్పీహెచ్‌‌ఎస్‌‌లో మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు.

రూ. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన వాటిని తాళాలు వేసి నిరుపయోగంగా ఉంచడం ఏంటని ప్రశ్నించారు. రాయికోడ్‌‌ నుంచి జంబ్గి చౌరస్తా వరకు చేపట్టిన మెటలింగ్ రోడ్డుకు సంబంధించిన నిధులు గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసినా.. వాటికి సంబంధించిన బిల్లులు ఎందుకు పెట్టలేదని పీఆర్‌‌ ఏఈని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు కొంత తవ్వించి పరిశీలించారు.

క్వాలిటీ కంట్రోల్‌‌ ఆఫీసర్లు పనులను సక్రమంగా పరిశీలించకుండానే రికార్డుల్లో సంతకాలు చేయడం వల్ల బిల్లులు చెల్లిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం హస్నాబాద్‌‌లో పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను పరిశీలించారు. వారి వెంట రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ శశికుమార్‌‌, ఎస్‌‌పీఎంలు కృష్ణమూర్తి, మురళీధర్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌ అబేద్‌‌ఖాన్‌‌, డీఆర్డీవో ఓ జ్యోతి, అడిషనల్‌‌ డీఆర్డీవో బాల్‌‌రాజు, ప్లాంటేషన్‌‌ మేనేజర్‌‌ మణికుమార్, ఆఫీసర్లు రాజు, షరీఫ్, రమేశ్‌‌, విష్ణు ఉన్నారు.