జూన్ 9న జగన్నాథ్​పూర్ ప్రాజెక్టుకు కేంద్ర బృందం

జూన్ 9న జగన్నాథ్​పూర్ ప్రాజెక్టుకు కేంద్ర బృందం

కాగజ్ నగర్, వెలుగు: పీఎంకేఎస్ వై, జేజేఎం పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం ఈ నెల 9న జగన్నాథ్ పూర్ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు.

కేంద్ర జలశక్తి శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 61 జిల్లాల్లో  ప్రాజెక్టుల పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 7 బృందాలను నియమించగా నోడల్ అధికారి వినోద్ శేషన్ నేతృత్వంలోని బృందం పెద్దవాగు జగన్నాథ్​పూర్ ప్రాజెక్టును సందర్శించనుందని చెప్పారు. సంబంధిత అధికారులు ప్రాజెక్టు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.