సదాశివనగర్​లో సెంట్రల్ టీం విజిట్

సదాశివనగర్​లో సెంట్రల్ టీం విజిట్

సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సెంట్రల్​ సెక్రటేరియట్ టీం పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. మూడో రోజు మర్కల్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్, మల్లన్న గట్ట వద్ద మిషన్​ భగీరథ, అడ్లూర్, ​ఎల్లారెడ్డి గ్రామ శివార్​లోని గాయత్రీ షుగర్స్ ​ఫ్యాక్టరీ విజిట్ చేసినట్లు ఎంపీడీవో సంతోశ్​ కుమార్​ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సురేందర్​ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాజు, ప్రశాంత్​, ఏపీవో మధు, టీఏ సంతోశ్​, అంగన్వాడీ టీచర్లు, మిషన్​ భగీరథ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.