
ఇస్రో చైర్మన్ శివన్ తన కుమారుడు సిద్ధార్థను నిబంధనలకు విరుద్ధంగా ఇస్రోలో నియమించారనే ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఫిర్యాదు నమోదు చేసింది. జనవరి 14న కే శివన్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. జనవరి 14కు కొన్నిరోజుల ముందు సిద్ధార్థకు ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)లో ఉద్యోగం వచ్చింది. నిబంధనల ప్రకారం ఇస్రోలో ఒక ఉద్యోగిని నియమించాలంటే స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించాలని, కానీ సిద్ధార్థకు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇచ్చారని ఇస్రో ఉద్యోగి నారాయణన్ సీవీసీకి కంప్లైంట్ చేశారు.