
హైదరాబాద్, వెలుగు: పరుపులు తయారు చేసే సెంచరీ మ్యాట్రెసెస్ సోఫాల విభాగంలోకి ప్రవేశించింది. తన బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్లో శుక్రవారం సోఫాలను లాంచ్ చేసింది. మూడు సీట్లు, రెండు సీట్లు, సింగిల్ సీటర్, లాంజర్ కాన్ఫిగరేషన్లలో ఇవి లభిస్తాయి. ఈ సందర్భంగా కంపెనీ ఈడీ ఉత్తమ్మలానీ మీడియాతో మాట్లాడుతూ ‘‘హైదరాబాద్లో మాకు ఇది వరకే మూడు ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి.
కొత్తగా మరొకటి ఏర్పాటు చేశాం. మనదేశ సోఫాల మార్కెట్సైజు రూ.50 వేల కోట్ల వరకు ఉంటుంది. రాబోయే మూడేళ్లలో సోఫా మార్కెట్లో 20 శాతం వాటా సంపాదించడం మా లక్ష్యం. సోఫాల తయారీ కోసం హైదరాబాద్లో రూ.35 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. హైదరాబాద్లో మాకు 4 తయారీ యూనిట్లు ఉన్నాయి”అని ఆయన వివరించారు.