ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శశాంక్ గోయల్ సమీక్ష

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శశాంక్ గోయల్ సమీక్ష

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈవో శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, శాంతి భద్రతలు, పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా అంశాలపై ఈ కార్యక్రమంలో ఆయన చర్చించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, వసతుల గురించి అధికారులతో చర్చలు జరిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల కోటాలో శుక్రవారం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం నుంచి ఎలక్షన్ జరగనున్న ఆయా జిల్లాల్లో  అధికారులు  మద్యం దుకాణాలు మూసేయనున్నారు.