- సెర్ఫ్ పెద్ద ఆఫీసర్ల తీరుపై ఫీల్డ్ స్టాఫ్ నిరసన
- సర్వే వాయిదా వేయాలంటున్న ఎంప్లాయ్స్
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్న టైంలో సెర్ఫ్(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్కేసులు పెరిగిపోతున్నాయి. వారిలో చాలా వరకు పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉంటూ ట్రీట్మెంట్చేయించుకుంటున్నారు. స్థానికులే పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళల వివరాలు ఎలా సేకరించాలని సెర్ఫ్ఫీల్డ్స్టాఫ్ప్రశ్నిస్తున్నారు. చాలా ఊళ్లలో ప్రజలు ఇండ్లకు రానివ్వడం లేదని చెబుతున్నారు. కానీ సెర్ఫ్ఉన్నతాధికారులు మాత్రం తప్పకుండా సర్వే చేయాలని, మహిళ ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అప్డేట్ చేయాలని, ఫొటోలు తీసి అప్ లోడ్చేయాలంటున్నారు. సెర్ఫ్స్టేట్ఎంప్లాయ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కరోనా తీవ్రత తగ్గేవరకు ఇంటింటి సర్వే వాయిదా వేయాలని డిమాండ్చేస్తూ ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డీఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఫీల్డ్సిబ్బందిలో
అసహనం పెరిగిపోతుంది.
50 లక్షల మందికి పైనే..
అన్ని జిల్లాల్లో 5 లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు(ఎస్హెచ్జీ)లు ఉన్నాయి. వాటిలో 50 లక్ష మందికి పైనే మహిళలు సభ్యులుగా ఉన్నారు. 20 వేల గ్రామ సమాఖ్యలు, 586 మండల సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు పని చేస్తున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఎస్ హెచ్జీలలో సభ్యులైన మహిళల వివరాలు, ఆధార్, మొబైల్, బ్యాంక్ అకౌంట్ నంబర్లతో సహా ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో ఎంట్రీ చేశారు. ఆ
సమాచారం ఆధారంగానే వివిధ స్కీంలు అమలవుతున్నాయి. కాగా ప్రభుత్వ సైట్లోని వివరాలు సరిగా ఉన్నాయా.. లేదా? ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్చేయాలని ఎస్ హెచ్ జీ వారీగా సభ్యులందరి డీటెయిల్స్రీ ఎంట్రీ చేయాలని సెర్ఫ్ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఎస్ హెచ్ జీ పేరు, వారి పేరు, ఆధార్ కార్డ్, మొబైల్, బ్యాంకు అకౌంట్నంబర్లను ట్యాబ్లో ఎంట్రీ చేయాలని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరికి మాస్క్లేకుండా ఫొటో తీసి అప్లోడ్చేయాలని పేర్కొన్నారు. ఎస్హెచ్ జీ మెంబర్చనిపోయినా, వలస వెళ్లి అందుబాటులో లేకుండా ఉన్నా గ్రూప్నుంచి తొలగించి కొత్తవారిని చేర్పించాలని చెప్పారు. టార్గెట్కంప్లీట్చేయకపోతే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీడియో కాన్ఫరెన్స్లో హెచ్చరించారని ఫీల్డ్ స్టాఫ్ తెలిపారు.
త్వరలో కార్యచరణ ప్రకటిస్తాం
ఇప్పటికే డీఆర్డీఏ జిల్లా అధికారులు సెర్ఫ్స్టాఫ్తో మీటింగులు పెట్టి సర్వే ప్రాసెస్పై వివరించారు. ఆయా మండలాల ఏపీఎంలు సంబంధిత యాప్ డౌన్ లోడ్చేయించి వీఓఏల ద్వారా సర్వే స్టార్ట్చేశారు. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఒక ఏపీఎం, ఆదిలాబాద్ జిల్లాలో ఒక సీసీ కరోనాతో చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 మంది సెర్ఫ్స్టాఫ్ కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో సర్వే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సెర్ఫ్ఎంప్లాయ్స్ జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.