మహబూబ్ నగర్ లోని మెడిసిన్ రేట్లు తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

మహబూబ్ నగర్ లోని మెడిసిన్  రేట్లు తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మెడిసిన్  రేట్లు తగ్గించాలని డిమాండ్  చేస్తూ మెడికల్  అండ్​ సేల్స్  రిప్రజెంటేటివ్  యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్  ఎదుటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్  అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున్, శోభన్  యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కిల్లే గోపాల్  మాట్లాడుతూ దేశంలో మెడిసిన్స్​ రేట్లు విపరీతంగాపెరగడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల దోపిడీని అరికట్టాలని, మెడికల్  సేల్స్  ప్రమోషన్  యాక్ట్ ను పునరుద్ధరించి, మెడికల్  రిప్రజెంటేటివ్​ల కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 

మేనేజ్​మెంట్​ ఒత్తిడితో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మందుల కంపెనీలను నియంత్రించాలని, ధరలను అరికట్టాలని డిమాండ్  చేశారు. కార్మికుల సమ్మె హక్కును కొనసాగించాలని కోరారు. అనంతరం లేబర్  కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. విష్ణువర్ధన్, రమేశ్, ఖమర్​ అలీ, రమణ, రాజ్ కుమార్, రమణారెడ్డి పాల్గొన్నారు.