
హైదరాబాద్, వెలుగు: స్టార్టప్ కంపెనీ కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ (సీఎఫ్సీ) హైదరాబాద్లో తమ కార్పొరేట్ ఆఫీస్ను శనివారం ఓపెన్ చేసింది. ఈ కంపెనీ రాజమండ్రిలో 2021 లో తన బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫ్రాంచైజీ మోడల్లో క్లయింట్ల కోసం స్టోర్ను సీఎఫ్సీ ఓపెన్ చేసి పెడుతుంది.
ఇందుకోసం రూ.3 లక్షలు వసూలు చేస్తుంది. అవుట్లెట్ను క్లయింట్లకు రెడీ చేసి ఇస్తామని, కాఫీ మెషీన్తో పాటు స్టార్టింగ్లో కాఫీ, టీ పొడి, ఇతర ఇంగ్రీడియెంట్లను ఉచితంగా సప్లయ్ కూడా చేస్తామని సీఎఫ్సీ ఫౌండర్ గోలి గోపి వెల్లడించారు.
రాయల్టీ ఛార్జీలు తీసుకోమని చెప్పారు. కేవలం సప్లయ్తో తమకు రెవెన్యూ వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 65 ఫ్రాంచైజీ అవుట్లెట్లను ఓపెన్ చేశామని అన్నారు. ఫిల్టర్ కాఫీ, టీ, స్నాక్స్ తమ అవుట్లెట్లలో దొరుకుతాయని, తొమ్మిది రకాల కాఫీ, ఐదు రకాల టీ రూ.20 నుంచే దొరుకుతాయని పేర్కొన్నారు.