నిజామాబాద్ లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్

నిజామాబాద్ లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్

నిజామాబాద్ లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోయింది. తెల్లవారు జామున నలుగురు దొంగలు ఓ ఇంటీ  తలుపులు పగలగొట్టి దాడి చేశారు. అడ్డుకున్న వారిపై కర్రలు, రాళ్లతో డాడి చేసి పారిపోయారు.

నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో ఓ ఇంట్లొ దోపిడికి ప్రయత్నించింది చెడ్డీగ్యాంగ్ . గోపి నాయక్, తోలియా నాయక్ అనే ఇద్దరు తమ ఇంట్లో తెల్లవారు జామున నలుగురు నలుగురు దుండగులు ఇంటిపై దాడి చేసారు. తలపులు, కిటికీలు పగలగొట్టారు. మెయిన్ డోర్ తెరుచుకోకపోవటంతో హైడర్లతో తలపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఇద్దరు వీరిని అడ్డుకున్నారు. సుమారు గంట సేపు దొంగల్ని అడ్డుకున్నారు ఆ ఇంటి వ్యక్తులు. భయట నుంచి దుండగులు రాళ్ళు, కర్రలు, హైడర్లు, గాజు ముక్కలు విసరటంతో లోపల ఉన్న ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. వీరు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటాన సమయంలో పోలిసులుకి బాధితులు ఫోన్ చేసినా సకాలంలో రాలేదని వారు వాపోతున్నారు. చుట్టుపక్కల వ్యక్తులు వచ్చి బయట ఉన్న దొంగల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వారు పారిపోయినట్లు చెబుతున్నారు స్థానికులు.