ఉపరాష్ట్రపతిగా రాజీనామా తర్వాత.. తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగదీప్ ధంఖర్

ఉపరాష్ట్రపతిగా రాజీనామా తర్వాత.. తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగదీప్ ధంఖర్

ఉపరాష్ట్రపతిగా రాజీనామా తర్వాత..తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగదీప్​ధంఖర్. భోపాల్​ లో జరిగిన  ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కనిపించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ధంఖర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానం ఎక్కడం కంటే తన విధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ ఆకట్టుకునే కామెంట్స్​ చేశారు. వ్యక్తిగత, రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు అతని నిబద్దతను హైలైట్​ చేశాయి. 

శుక్రవారం (నవంబర్​22) మధ్యప్రదేశ్​ లోని భోపాల్​ లో హమ్ ఔర్​ యా విశ్వ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు ధంఖర్​. ఆనారోగ్యకారణాలను చూపుతూ  ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేయడం చుట్టూ ఉన్న ఊహాగానాలుఉన్నప్పటికీ అయినా దానిపై స్పందించనని ధంఖర్​ స్పష్టం చేశారు. సవాళ్ల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై ధంఖర్​ తనదైన శైలీలో హెచ్చరించారు. అది చక్రవ్యూహం అని తప్పించుకోవడం సాధ్యం కాదు అని అన్నారు. 

జగదీప్​ ధంఖర్ ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశారు. దంఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రతిపక్షాల నుండి తీవ్ర  విమర్శలను ఎదుర్కొంది.  రాజీనామా తర్వాత ధంఖర్​ ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. ఆయన లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో భారతదేశ ఆర్థిక వృద్ధి పట్ల తనకు గర్వం ఉందని నొక్కి చెప్పడం చర్చకుదారితీసింది. 

ధంఖర్​ రాజనీమా వెనక రాజకీయ కుట్ర?

జగదీప్​ దంఖర్ ప్రతిపక్షాలకు సపోర్టు చేస్తున్నాడు.. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు విరుద్దంగా ప్రతిపక్షాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించారు.. ఆ తర్వాత ఒత్తిడి కారణంగానే ధంఖర్​ రాజీనామా చేశారని విమర్శలు వచ్చాయి. ఇది ఎన్డీయే కూటమిలో అంతర్గత ఉద్రిక్తతలకు దారి తీసింది. అధికారికంగా ధంఖర్​ అనారోగ్యం కారణంగా రాజీనామా చేశారని చెబుతున్నప్పటికీ లోతైన రాజకీయ విభేదాలు ఉన్నాయని కొనసాగుతున్నాయి. రాజకీయంగా అనేక చిక్కులను ఎదుర్కొంటూనే విధి పట్ల దృఢమైన నిబద్ధత, ప్రాముఖ్యతను ఆయన అంతర్లీన వ్యాఖ్యలు నొక్కి చెబుతున్నాయి.