
- భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి కామెంట్
- కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు
- కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలపై దర్యాప్తు సంస్థలకు కంప్లయింట్ చేయాలని డిమాండ్
- రాష్ట్రాభివృద్ధికి ప్రధానిని వంద సార్లైనా కలుస్తామని వెల్లడి
జనగామ, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్మాయలు చేసి కవితను కాంగ్రెస్లోకి పంపాలని చూస్తున్నడు. ఆయన మోసాలు మా దగ్గర నడువయ్. ఏదో పది మంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వస్తనని కవిత అన్నట్లు పేపర్లో చూసిన. ఆ ఎమ్మెల్యేలు వద్దు.. ఆమె అవసరం మాకు లేదు. మాకు సరిపడా బలం ఉంది’’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీస్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో రూ. లక్షల కోట్లు దోచుకుని దాచుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వాటి పంపకాల్లో తేడా వచ్చిందని, అందుకే కవిత ఎపిసోడ్వాటాల పంచాదీగా మారిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరో కవిత వెంటనే బయటపెట్టాలని.. లేదంటే రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్చేశారు. పహల్గామ్ఉగ్రదాడిని పార్టీలకు అతీతంగా ఖండించి ఆపరేషన్సిందూర్కు సంఘీభావం పలికామని, దీనిపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని ప్రధాని మోదీని కోరితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని, అందుకే రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ ఎంపీలం 100 సార్లైనా ప్రధానిని కలుస్తామన్నారు. ప్రత్యేక ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కమిటీ వేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట యూత్కాంగ్రెస్ స్టేట్ లీడర్కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మేడ శ్రీనివాస్, బాలరాజు, చెంచారపు బుచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.