చందానగర్, వెలుగు: సిటీలో కారును అద్దెకు తీసుకుని ఏకంగా పంజాబ్లో అమ్మేసిన వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహెచ్ఈఎల్ ఎంఐజీకి చెందిన సుమన్ అల్లగిరి తన ఇన్నోవా హైక్రాస్ కారును జూమ్ సెల్ఫ్ డ్రైవ్ యాప్లో అద్దెకు పెట్టాడు. జనవరి 27న మహ్మద్ నజీర్ అనే వ్యక్తి ఏపీలో పెళ్లి ఉందని చెప్పి ఆ కారును అద్దెకు తీసుకున్నాడు. రోజులు గడిచినా కారును తిరిగి ఇవ్వకపోగా, ఫోన్ చేసినా స్పందించలేదు.
జూమ్ యాప్ నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కారు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నజీర్ను అదుపులోకి తీసుకోగా, అప్పటికే కారును రూ. 11.50 లక్షలకు విక్రయించినట్లు తేలింది.
అనంతరం కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నజీర్ను రిమాండ్కు తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూమ్ యాప్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
