బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్

బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్
  • 12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీకుష్​  స్వాధీనం
  • ఐదుగురు అరెస్ట్

చందానగర్, వెలుగు: ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ అమ్ముతున్న ఇద్దరితో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్​ ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద  12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీకుష్​ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం ఇన్​స్పెక్టర్​ వెంకన్న తెలిపిన ప్రకారం.. కృష్ణ జిల్లా ఎలమలూరు గ్రామానికి చెందిన వంశీ దిలీప్(29), చీరాల రామకృష్ణపురం గ్రామానికి చెందిన బాల ప్రకాశ్​బాలు(29) న్యూ ఇయర్​ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బెంగలూరులో ఓ నైజీరియన్​ వద్ద ఎండీఎంఏ, ఓజీకుష్​ కొనుక్కొని హైదరాబాద్​కు వచ్చారు.

సోమవారం కొండాపూర్​ అంజయ్యనగర్​లోని ఓ పీజీ హాస్టల్​లో డ్రగ్స్​ అమ్మేందుకు ప్రయత్నించగా రాజేంద్రనగర్​ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్​ కొనుగోలు చేస్తున్న మణికంఠ మణితేజ(30), ఐటీ ఉద్యోగి రోహిత్​ గౌడ్​(26), బిజినేస్​మ్యాన్​ తరుణ్​(33)ను అదుపులోకి తీసుకున్నారు. మణితేజ, రోహిత్​గౌడ్​, తరుణ్​కు పరీక్షలు చేయగా పాజిటివ్​ వచ్చింది. వీరి వద్ద రూ.లక్షా 50 వేల విలువైన ఎండీఎంఏ, ఓజీకుష్​, 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అలీం, ఓజీ కుష్​ సప్లై చేసిన కార్తీక్​, బెంగళూరులో అమ్మిన నైజీరియన్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.