అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 26కి వాయిదా..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 26కి వాయిదా..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈరోజు(సెప్టెంబర్ 21)  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్  26వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గతంలో  చంద్రబాబు సర్కార్ చేపట్టింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టారీతిలో మార్పులు చేశారని  జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డును మార్పులు చేసి  అక్రమాలకు పాల్పడ్డారని  సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ విషయంలో  చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై  సీఐడీ అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్  మార్చారని చంద్రబాబు సర్కార్ పై  వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది.

ALSO READ : ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై స్పందించిన శ్రుతి హాసన్‌.. వెంటపడ్డ అగంతుకుడు ఎవరంటే?

ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ సమయంలోనే  విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు  పీటీ వారెంట్  దాఖలు చేసింది.  దీంతో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను  ఈ నెల  26వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హైబ్రిడ్ మోడ్ పద్దతిలో ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని  ఏపీ హైకోర్టు  తెలిపింది.