ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా మూలాలు ఏపీలోనే

ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా మూలాలు ఏపీలోనే
  • డీజీపీని రీకాల్ చేయాలి..రాష్ట్రపతిని కోరిన చంద్రబాబు

ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు... టీడీపీ అధినేత చంద్రబాబు.  టీడీపీ నేతలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్  పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయన్నారు. నేష్నల్, ఇంటర్ నేషనల్ లో ఎక్కడా లేని లిక్కర్  బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఆర్టికల్  356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని.. రాష్ట్రపతిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. సీఎంతో కలిసి డీజీపీ పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. డీజీపీని రీకాల్  చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు.